చెన్నై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా 5,879 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 2,51,738 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వల్ల ఇవాళ 99 మంది మృతి చెందగా, కోవిడ్ -19 వల్ల మొత్తం 4034 మంది మృతి చెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 56,738 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm