విశాఖపట్నం: విశాఖలోని సృష్టి ఆస్పత్రి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. పసిపిల్లల అక్రమ రవాణా కేసులో సృష్టి ఆస్పత్రితోపాటు మరి కొన్ని ఆస్పత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. సీతమ్మధారలోని పద్మజా ఆస్పత్రిలో పోలీసులు సోదాలు చేశారు. డాక్టర్ పద్మజాను విచారించినట్లు పోలీసులు తెలిపారు. సుమారు రెండు గంటలపాటు డాక్టర్ నువిచారించినట్లు పోలీసులు వెల్లడించారు. పద్మజా ఆస్పత్రిలో విస్తృతంగా తనిఖీలు చేసి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటివరకు ఆస్పత్రిలో చేసిన డెలివరీలపై ఆరా తీశారు. సృష్టి ఆస్పత్రిలో దొరికిన కీలక డాక్యుమెంట్ల ఆధారంగా పలు ఆస్పత్రులతో లింకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సృష్టి, పద్మజా ఆస్పత్రులతోపాటు మరికొన్ని ఆస్పత్రుల్లో 10 మంది పిల్లల అక్రమ రవాణా జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని ఆస్పత్రుల్లో కూడా సోదాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm