హైదరాబాద్: కరోనా బాధితుల నుంచి చికిత్సకు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై తెలంగాణ సర్కారు మరో ప్రైవేటు ఆస్పత్రిపై చర్యలు తీసుకుంది. బంజారాహిల్స్లోని విరించి ఆస్పత్రిపై వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది. కరోనా చికిత్సకు ఇచ్చిన అనుమతులను రద్దుచేసింది. కొత్తగా కరోనా బాధితులను చేర్చుకోవడానికి వీల్లేదని స్పష్టంచేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న రోగులకు చికిత్స కొనసాగించాలని సూచించింది. ఇప్పటికే సోమాజిగూడ డెక్కన్ ఆసుపత్రిపై చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రైవేటు ఆసుపత్రులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పద్ధతి మార్చుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. లేకుంటే ఆసుపత్రి అనుమతులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm