హైదరాబాద్ : కరోనాతో విలవిలలాడుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైకి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 3 రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు మహా నగరం తడిసి ముద్దవుతోంది. థానే, పాల్గర్, రాయ్ఘడ్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడ్డాయి. రాగల 24 గంటల్లో ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముంబై తీర ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలకు తోడు..అరేబియా సముద్రంలో ఏర్పడిన ద్రోణి కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ముంబై నగరం మొత్తం నిండు కుండాల మారిపోయింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాగల 48 గంటల్లో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm