కరీంనగర్ : కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వీణవంక మండలంలోని వల్బాపూర్కు చెందిన వ్యక్తి ఇటీవల కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా తేలింది. వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేకపోవడంతో హోం ఐసొలేషన్లో ఉండాలని వైద్యులు సూచించారు. కానీ డాక్డర్ల సూచనలను లెక్కచేయకుండా బుధవారం మరో పది మందితో కలిసి పేకాట ఆడాడు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది సదరు వ్యక్తితో పేకాడిన వారిని గుర్తించి హోంక్వారంటైన్లో ఉండాలని సూచించారు. కాగా కరోనా బాధితుడి తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm