హైదరాబాద్ : అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా.. నగరంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. పాతబస్తీలోని సైదాబాద్ డివిజన్లో సిటీ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పర్యటించారు. సీపీ వెంట అదనపు పోలీసు కమిషనర్ షికా గోయల్, జాయింట్ సీపీ రమేశ్ ఉన్నారు. మలక్పేట ఏసీపీ కార్యాలయం నుంచి అంజనీ కుమార్ శాంతిభద్రతలను పర్యవేక్షించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్న పోలీసులను సీపీ అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm