హైదరాబాద్: మైత్రివనం కాంప్లెక్స్ వద్ద ఓ వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు అతి దారుణంగా దాడి చేశారు. ఏస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైత్రివనం కాంప్లెక్స్ వద్ద వ్యాపార లావాదేవీల మధ్య గొడవ పడడంతో లక్కిరెడ్డి తిరుపతి రెడ్డి అనే వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. తిరుపతి రెడ్డికి తీవ్ర గాయాలవడంతో సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఒక ఫార్మా కంపెనీలో ఇద్దరు భాగస్వాములుగా ఉన్నారని, వారి మధ్య ఆర్థిక లావాదేవీలే గొడవకు దారితీసినట్లు పోలీసుల నిర్ధారించారు. దాడికి పాల్పడిన వెంకట్ రెడ్డి, వశిష్ రెడ్డిలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm