హైదరాబాద్ : ప్రస్తుతం కరోనా వైరస్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పేద ధనిక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కరోనా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. సినిమా ఇండస్ట్రీలలో కూడా ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ భారిన పడిన వారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. తాజాగా సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఆమె నివాసంలోని 11 మంది కరోనా బారిన పడ్డారు. తొలుత నవనీత్. మామ గంగాధర్ రానాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో.. నవనీత్కు, ఆమె భర్తకు కరోనా టెస్టులు నిర్వహించారు. దాదాపు 60 మంది సభ్యులు, కార్యకర్తలకు కరోనా పరీక్షలు చేశారు. నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm