హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్కు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి... ఒకేరోజు ఏకంగా ఏడుసార్లు ఫోన్ చేసి బెదిరించారని నాగేశ్వర్ వాపోయారు.. నాకు ఇటీవలి కాలంలో ఎక్కువగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి... నన్ను చంపుతామని గుర్తు తెలియని వ్యక్తులు కాల్స్ చేస్తున్నారన్న ఆయన.. జులై 25వ తేదీ నుంచి ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయని.. ఒకేరోజు ఏడుసార్లు ఫోన్ చేసి చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారని తెలిపారు.. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను.. నేను యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేస్తున్న కారణంగానే చంపుతామంటూ కాల్స్ చేస్తున్నారని.. బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఇటీవలి కాలంలో ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టిన ప్రొఫెసర్ నాగేశ్వర్... వివిధ అంశాలపై ఆయన స్పందనను వీడియో రూపంలో అప్లోడ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm