ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ విచారణకు రంగం సిద్ధమైంది. ఈ కేసు విచారణకు గానూ సీబీఐ ప్రత్యేక బృందం ఏర్పాటు కానుంది. గుజరాత్ కేడర్కు చెందిన మనోజ్ శశిధర్ ఐపీఎస్ నేతృత్వంలో ఈ ప్రత్యేక టీం ఏర్పాటు కానున్నట్లు తెలిసింది. ఈ ప్రత్యేక బృందం డీఐజీ గగన్దీప్ గంభీర్ పర్యవేక్షణలో పనిచేయనుంది. ఇన్వెస్టిగేషన్ అధికారిగా అనిల్ యాదవ్ సుశాంత్ కేసును విచారించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm