చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు ఐదు సుమారు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,272 కరోనా కేసులు, 110 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి మొత్తం సంఖ్య 2,79,144కి, మృతుల సంఖ్య 4,571కి చేరింది. మరోవైపు కరోనా నుంచి ఇప్పటి వరకు 2,21,087 మంది కోలుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 53,486 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారని వివరించారు. ఇప్పటి వరకు 29,10,468 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పాజిటివ్గా నిర్ధారణ అయిన వారిలో 1,68,889 మంది పురుషులు, 1,10,228 మంది స్త్రీలు, 27 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నట్లు వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm