కృష్ణా : కారు డోర్స్ లాక్యై ఊపిరాడక ముగ్గురు బాలికలు మృతిచెందారు. ఈ విషాద సంఘటన ఏపీలోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో చోటుచేసుకుంది. సింటక్స్ సంస్థ కార్మికుల గృహ సముదాయంలో ముగ్గురు బాలికలు ఆడుకుంటూ కారులోకి వెళ్లారు. కారు రోడ్లాక్ కావడంతో ఊపిరాడక చిన్నారులు మృతిచెందారు. మృతులు ముగ్గురూ ఆరేళ్ల వయసు బాలికలు. మృతులను సుహానా పర్విన్, యాస్మిన్, అఫ్సానాగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు పశ్చిమ బెంగాల్ చెందినవారు కాగా మరొకరు అసోంకు చెందిన బాలిక.
Mon Jan 19, 2015 06:51 pm