ముంబై: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని తండ్రి జగదీశ్ సింగ్ పటానీకి కరోనా సోకింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ విజిలెన్స్ యూనిట్ లో జగదీశ్ సింగ్ డిప్యూటీ ఎస్పీగా పనిచేస్తున్నారు. కరోనా పరీక్షలు చేయించుకోగా జగదీశ్ సింగ్ కు పాజిటివ్ గా నిర్దారణ అయింది. లక్నోలో వెలుగు చూసిన ఓ ట్రాన్స్ ఫార్మర్ స్కాం కేసును జగదీశ్ సింగ్ తోపాటు మరో ఇద్దరు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఉన్న మిగిలిన ఇద్దరు అధికారులకు కూడా పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో జగదీశ్ సింగ్ తోపాటు ఇద్దరు ఆఫీసర్లు డాక్టర్ల సలహా మేరకు క్వారంటైన్ కు పరిమితమయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Aug 06,2020 09:30PM