హైదరాబాద్ : కేరళలోని కోజికోడ్లో విమాన ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి కోజికోడ్కు వస్తున్న ఎయిరిండియాకు చెందిన డీఎక్స్బీ-సీసీజే బోయింగ్ 737 ఐఎక్స్ 1344 విమానం రన్వే పై నుంచి జారి రెండు ముక్కలైంది. ఈ ఘటనలో పైలట్తో పాటు మరో ఐదుగురు మృతి చెందారు. మరో పైలట్ సహా 35 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా! ప్రమాద సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు, 10 మంది పిల్లలు, ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. భారీగా కురుస్తున్న వర్షాల కారంగా రన్వేపైకి నీరు చేరడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం 7 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ విమాన ప్రమాదంపై డీసీజీఏ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.
అమిత్షా విచారం.. విజయన్కు ప్రధాని ఫోన్
కేరళ విమాన ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి చేరుకుని ముమ్మర సహాయక చర్యలు చేపట్టాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించినట్లు తెలిపారు. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని సహాయచర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రమాద ఘటనపై కేరళ సీఎంతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. స్థానిక యంత్రాగం చేపడుతున్న సహాయ చర్యల గురించి ప్రధానికి వివరించినట్లు కేరళ సీఎంవో వర్గాలు తెలిపాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Aug 07,2020 10:15PM