అహ్మదాబాద్: గుజరాత్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. ప్రతిరోజు వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,078 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య డెబ్బై వేల మార్కును దాటి 71,064కు చేరింది. అందులో 54,138 మంది ఇప్పటికే వైరస్ బారినుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 14, 272 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గుజరాత్లో కరోనా మరణాలు కూడా క్రమం తప్పకుండా పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 25 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,654కు చేరింది. గుజరాత్ ఆరోగ్యశాఖ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm