రాజమండ్రి: జిల్లాలో కొవిడ్ విలయం సృష్టిస్తోంది. ఊహకందని వేగంతో మహమ్మారి పరుగులు తీస్తోంది. వేలాది కేసులతో తూర్పును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలేం జరుగుందో అర్థం కాని రీతిలో వైరస్ దాడి చేస్తోంది. ఎందుకు ఇన్ని కేసులు నమోదవుతున్నాయో.. మూలాలు ఎక్కడ్నించి ఎలా వ్యాపిస్తున్నాయో వైద్యులు, అధికారులకు అంతు చిక్కట్లేదు. ఆదివారం కూడ జిల్లాలో కరోనా ఉధృతి తగ్గలేదు. ఈరోజు కొత్తగా 1,543 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 31వేల 703కి మొత్తం పాజిటివ్ కేసులు చేరాయి. ఈరోజుకు మరో ప్రత్యేక కూడా ఉంది. ఈ రోజు ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,299 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ కరోనా నుంచి 17వేల 446 మంది కోలుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm