హైదరాబాద్ : మహారాష్ట్రలో కరోనా కల్లోలం రేపుతోంది. ఇవాళ ఒక్కరోజే మహారాష్ట్రలో 12,248 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో.. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,15,332కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 1,45,558 కాగా.. కరోనా నుంచి 3,51,710 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య మహారాష్ట్ర ప్రజలను మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 390 మంది కరోనాతో మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కరోజే ఇన్ని మరణాలు నమోదు కావడంతో కొంత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం కరోనా మరణాల సంఖ్య 17,757కి చేరింది.
Mon Jan 19, 2015 06:51 pm