హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్. హర్యానా, ఢిల్లీలో నేడు వర్షాలు కురువనున్నట్లు భారత వాతావరణశాఖ పేర్కొంది. యూపీలోని బిజినోర్, ముజఫర్నగర్, మొరాదాబాద్, కురుక్షేత్ర, నజియాబాద్, యమునానగర్లో రానున్న రెండు గంటల్లో తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయంది. ఈశాన్య రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపురలో కుండపోత వర్షాలు పడనున్నట్లు తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm