హైదరాబాద్ : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో రోడ్డు పక్కన మొక్కజొన్నల తోపుడు బండిని ధ్వంసం చేసినందుకు గాను ఎస్ఐను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎస్ఐ వరుణ్ కుమార్ శశి వారణాసిలోని శివపూర్ ప్రాంతంలో తోపుడు బండిపై ఉన్న మొక్కజొన్నలను రోడ్డుపై విసిరేస్తూ, బండి మొత్తాన్ని అమాంతం ఎత్తి మొక్కజొన్నలను కింద పడేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడిని సస్పండ్ చేసి విచారణకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ తరువాత మొక్కజొన్న వ్యాపారికి నష్టపరిహారం అందజేసి క్షమాపణలు తెలియజేశారు. అయితే ఎస్ఐ ఆ వీధి వ్యాపారిపై ఆగ్రహం ప్రదర్శించడానికి గల కారణం తెలియరాలేదు. కానీ స్థానిక లాక్డౌన్ సాయంత్రం 5 గంటలకు అమల్లోకి వచ్చిన తరువాత కూడా వ్యాపారి మొక్కజొన్న విక్రయాలను కొనసాగించడం వల్ల ఎస్ఐ ఇలా చేశాడని స్థానికులు అంటున్నారు. ఏది ఏమైనా ఎస్ఐ ఇలా చేయడం తప్పేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm