హైదరాబాద్ : రాజస్థాన్లో సంక్షోభం కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు తననెంతో బాధించాయని యువనేత సచిన్ పైలట్ పేర్కొన్నారు. 'పనికిమాలిన వ్యక్తి, సర్కారును కూలదోయడానికి బీజేపీతో కలిసి కుట్రలు పన్నుతున్నాడు' అంటూ సీఎం గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధపెట్టాయని ఆయన తెలిపారు. తన కుటుంబం తనకు కొన్ని విలువలు నేర్పిందని, తాను ఎవరిని ఎంత వ్యతిరేకించినా అలాంటి భాషను మాత్రం ఎప్పుడూ ఉపయోగించలేదని పైలట్ ఆవేదన వ్యక్తంచేశారు.
సీఎం గెహ్లాట్ వయసులో తనకంటే చాలా పెద్ద వ్యక్తని, ఆయనను చాలా గౌరవిస్తానని సచిన్ పైలట్ పేర్కొన్నారు. అయితే పాలనాపరంగా తలెత్తిన లోపాలపై గొంతెత్తే హక్కు తనకు పూర్తిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 20 ఏండ్ల రాజకీయ జీవితంలో తానెన్నడూ లక్ష్మణరేఖ దాటలేదని పైలట్ చెప్పారు. వ్యక్తిగత దూషణలు చేయడం, కఠినమైన పదాలు వాడటం సరికాదని, ప్రజా జీవితంలో అలాంటివి ఉండకూడదని పేర్కొన్నారు. సీఎం గెహ్లాట్కు తనకు మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని పైలట్ స్పష్టంచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Aug 11,2020 03:56PM