హైదరాబాద్ : రాజస్థాన్ సంక్షోభం కొలిక్కి వచ్చిందని ఊపిరి పీల్చుకునే లోపలే కాంగ్రెస్ కు మరో తలనొప్పి వచ్చి పడింది. ఆ పార్టీకి చెందిన 6గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను నేరుగా స్పీకర్కే పంపించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ శాసన సభ్యుడు ఓ హెన్రీ సింగ్ ప్రకటించారు. తమ నేత ఓ లబోబి సింగ్ నాయకత్వంపై తమకు ఏ మాత్రం నమ్మకం లేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. అతిపెద్ద పార్టీగా అవతరించినా... కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైందని సింగ్ విమర్శించారు. సోమవారం అసెంబ్లీ సమావేశం ముగియగానే... ఆ ఆరుగురు ఎమ్మెల్యేలతో స్పీకర్ సమావేశమయ్యారని, వారి రాజీనామా లేఖలను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. వారి రాజీనామా లేఖలను స్పీకర్ ఇంకా ఆమోదించలేదని హెన్రీ సింగ్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm