కోల్కతా: ఒక బాలుడిపై నుంచి లారీ దూసుకెళ్లడంతో చనిపోయాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆ లారీకి నిప్పంటించారు. పశ్చిమ బెంగాల్లో మంగళవారం ఈ ఘటన జరిగింది. దుర్గాపూర్ నగరానికి చెందిన 13 ఏండ్ల బాలుడి పై నుంచి భారీ లారీ దూసుకెళ్లింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆగ్రహించిన స్థానికులు ఆ లారీ కి నిప్పుపెట్టి ధ్వంసం చేశారు. డ్రైవర్ను చితక బాదారు. రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు స్థానికులను సముదాయించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm