హైదరాబాద్ : జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లా పరిధిలోని కామరాజిపోరా ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. ఉగ్రవాదుల అజ్ఞాతవాసం గురించి నిఘా సమాచారం అందుకున్న తరువాత సైన్యం సంఘటన స్థలానికి చేరుకుంది. పోలీసులను చూడగానే పారిపోందుకు ఉగ్రవాదులు వారిపై కాల్పులు ప్రారంభించారు. భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరుపడంతో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో సైన్యానికి చెందిన ఓ జవాను అమరుడయ్యాడు.
ఈ ఆపరేషన్ను సీఆర్పీఎఫ్తో కలిసి ఆర్మీ నేషనల్ రైఫిల్స్ చేపట్టింది. ప్రస్తుతం ఈ ప్రాంతం సైన్యం ఆధీనంలో ఉన్నది. మరింత మంది ఉగ్రవాదులు నక్కి ఉండొచ్చని భద్రతా బలగాలు ఇంటింటిని గాలిస్తున్నాయి. ఎన్కౌంటర్లో మృతిచెందిన ఉగ్రవాది మృతదేహాన్ని భద్రతా దళాలు తీసుకుపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఎన్కౌంటర్లో ఒక సైనికుడు అమరుడు కాగా, మరో జవాన్ గాయపడ్డాడు. చికిత్స కోసం అతడిని 92 బేస్ దవాఖానకు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Aug 12,2020 06:21PM