బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 7,883 కరోనా కేసులు నమోదు కాగా, 113 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,96,494కు, మరణాల సంఖ్య 3,510కి చేరింది. గత 24 గంటల్లో 7,034 మంది కరోనా రోగులు కోలుకున్నారని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి 1,12,633 మంది కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. కర్ణాటకలో ప్రస్తుతం 80,343 యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఒక్క బెంగళూరులోనే 2,802 పాజిటివ్ కేసులున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm