హైదరాబాద్ : ప్రైవేట్ ఆస్పత్రులకు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రైవేటు హాస్పిటల్స్లో కోవిడ్ చికిత్స ఫీజులపై మరోసారి మార్గదర్శకాలు విడుదల చేసింది. అధిక బిల్లులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మాత్రమే చికిత్సకు తీసుకోవాలని పేర్కొంది. ఫీజుల వివరాలను ఆస్పత్రిలో కీలక ప్రదేశాల్లో ప్రదర్శించాలని ఆదేశించింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని సూచించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మాత్రమే చికిత్సకు తీసుకోవాలి. కోవిడ్ చికిత్సకు వినియోగించే మందులకు ఎంఆర్పీ ధరలను, పీపీఈ కిట్లు, ఖరీదైన మందుల ధరలను సైతం ఆస్పత్రిలో ప్రదర్శించాలని సూచించింది. రోగులను డిశ్చార్జి చేసే సమయంలో సమగ్ర వివరాలతో బిల్లు ఇవ్వాలని వెల్లడించింది ప్రభుత్వం. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు ఉంటాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm