హైదరాబాద్ : ఆర్ఎక్స్ 100 అనే రొమాంటిక్ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన దర్శకుడు అజయ్ భూపతి. తొలి సినిమాతోనే ఆయన మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు. ప్రస్తుతం మహా సముద్రం అనే సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. అయితే ఈ దర్శకుడు కరోనా బారిన పడడం అందరిని కలవర పరుస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే పలువురు టెక్నీషియన్స ఇప్పటికే కరోనా బారిన పడగా, తాజాగా అజయ్ భూపతికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నాకు వచ్చేసింది..త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా అని ట్వీట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ త్వరగా ఆయన కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm