హైదరాబాద్ : గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,931 కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యాయని గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 298 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 86,475కు చేరాయి. వైరస్ ప్రభావంతో మరో 11 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 665కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,736 యాక్టివ్ కేసులున్నాయి. మరో 1,780 వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా, 63,074 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 15,621 మంది హోం, ఇతర కేంద్రాల్లో ఐసోలేషన్లో ఉన్నారని చెప్పింది. కొత్తగా రాష్ట్రంలో 23,303 పరీక్షలు చేయగా, మొత్తం 6,89,150 పరీక్షలు చేసినట్లు పేర్కొంది. ఇంకా 706 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. తాజాగా నమోదైన 1,931 కొవిడ్ కేసులో హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 298 ఉండగా, తర్వాత వరంగల్ అర్బన్ జిల్లాలో 144, రంగారెడ్డి 124, కరీంనగర్లో 89, సంగారెడ్డి 86, నల్గొండ 84లో అత్యధికంగా కేసులు నిర్ధారణ అయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm