హైదరాబాద్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. తాజా కేసులతో దేశంలో 23 లక్షల 96 వేలు దాటింది. 24 గంటల్లో 66,999 కరోనా కేసులు నమోదవగా... 942 మంది మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 56,383 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం 23,96,645 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,53,622 ఉండగా, 16,95,982 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 47,033 మంది కరోనా వ్యాధితో మరణించారు. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.98 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 27.64 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 70.38 శాతంగా ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm