నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 166 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా నల్గొండలో 84, సూర్యాపేటలో 64, యాదాద్రి-భువనగిరిలో 18 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm