న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) ప్రవేశ పరీక్ష తేదీని నేషన్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఐఐఎంసీ పరీక్షను వచ్చే 18న నిర్వహించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు పరీక్షను ఇంటివద్ద నుంచే ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో రాసుకోవచ్చని తెలిపింది. ఐఐఎంసీ ఇప్పటికే ఎనిమిది పీజీ డిప్లొమా కోర్సుల దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ నెల 23 వరకు iimc.nic.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చని వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm