హైదరాబాద్ : ఎన్నికల ముందు అబద్దాలు చెప్పి ఓట్లు దండుకోవడం..గెలిచిన తర్వాత హామీలు మరిచిపోవడం టీఆర్ఎస్ పార్టీ తరువాతనే ఎవరైనా అని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క .
డబుల్ బెడ్ రూమ్ లపై భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ తనకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చూపిస్తానని మంత్రి తలసాని పారిపోయారని ఎద్దేవా చేశారు. లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చూపిస్తానని లిస్ట్ పంపారని, లిస్టు మాకెందుకు లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చూపించాలని తాను అన్నట్లు భట్టి తెలిపారు. లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లేవన్న వాస్తవాల్ని ప్రజలు గమనించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సవాలు స్వీకరించకుండా ఉండి ఉంటే..టీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగానే లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించిదేమోనని ప్రజలు నమ్మేవాళ్లని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మొద్దని భట్టి విక్రమార్క కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 18,2020 02:43PM