అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు, డీజిల్పై సెస్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూపాయి చొప్పున సెస్ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్కు అదనంగా ఈ రెండు ఉత్పత్తులపైనా సెస్ వసూలు చేయనున్నారు. సెస్ విధింపు ద్వారా ఏడాదికి రూ.600 కోట్ల మేర ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. డీలర్ నుంచి వసూలు చేసే సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రోడ్ల నిర్మాణం కోసం కేటాయించనున్నారు. ఈ నిధులను రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కేటాయించనున్నట్లు రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm