హైదరాబాద్ : కోలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్యపై నెల్లై అంబసముద్రం కోర్టులో పరువు నష్టం దావా కేసు నమోదైంది. అయితే 9 ఏళ్ల క్రితం నాటి చిత్రం గురించి ఇప్పుడు అతడిపై కేసు నమోదు కావడం గమనర్హం. వివరాల్లోకి వెళ్తే.. బాల దర్శకత్వంలో ఆర్య, విశాల్ ఇద్దరు అవన్ ఇవన్(తెలుగులో వాడు-వీడు) అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆర్య, విశాల్ ఇద్దరి పాత్రలకు గానూ సర్వత్రా ప్రశంసలు లభించాయి. అయితే ఇందులో సింగంపట్టి జమీన్ పాత్రను ఆర్య కించపరిచాడని ఇప్పుడు పరువు నష్టం దావా కేసు నమోదైంది. ఇక ఈ కేసుకి సంబంధించి సెప్టెంబర్ 23న తమ ముందు విచారణకు హాజరు అవ్వాలని కోర్టు ఆదేశించింది. మరి ఈ కేసులో ఆర్య ఎలా ముందుకు వెళ్తారు..? దీనిపై మూవీ దర్శకుడు బాల, ఆర్యకు మద్దతును ఇస్తారో.. లేదో..? చూడాలి. కాగా ఆర్య ప్రస్తుతం టెడ్డి అనే చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు 3 దేవ్ అనే మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm