హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్-2020 ప్రాథమిక కీ విడుదలైంది. ప్రాథమిక కీతో పాటు రెస్సాన్స్ షీట్లను విడుదల చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. ప్రాథమిక కీ కోసం టీఎస్ ఎంసెట్ వెబ్సైట్ను సందర్శించాలని ఆయన తెలిపారు. అభ్యంతరాలుంటే ఈ నెల 20 సాయంత్రం లోపు తెలపాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ (ఫార్మసీ, వెటర్నరీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు రోజులపాటు ఎనిమిది విడతల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఏపీ, తెలంగాణ నుంచి 1,19,187 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm