హైదరాబాద్ : మహిళపై లైంగికదాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా వావివరుసలు మరిచిన ఓ వ్యక్తి తన కుమారుడి భార్యను లైంగికదాడి చేయడమే కాదు. ఆమెను బ్లాక్ మెయిల్ చేసి పదే పదే అకృత్యాలను పాల్పడేందుకు ప్రయత్నించి కటకటాలపాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే...బీహార్ లోని లఖీసరాయ్ గ్రామంలో చున్నీలాల్ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా స్థానికంగా ఓ స్వీట్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య పది సంవత్సరాల క్రితమే మరణించగా, ఇద్దరు కుమారులతో కలిసి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పెద్ద కుమారుడు లఖన్ కు ఔరియా గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిపించారు. అయితే చిన్న కుమారుడు కోల్ కతాలో ఉద్యోగం చేస్తుండగా, పెద్ద కుమారుడు లఖన్ తరచూ వ్యాపార పనుల నిమిత్తం పాట్నా వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో లఖన్ భార్య మాన్సిపై చున్నీలాల్ కన్నేశాడు. అంతేకాదు ఆమెతో తరచూ ద్వంద్వార్థాలతో వేధించేవాడు. గతవారం యువతి బాత్రూంలో స్నానం చేస్తుండగా, చున్నీలాల్ ధైర్యం చేసి లోనికి ప్రవేశించాడు. మాన్సి నోరు మూసి ఆమెపై లైంగికదాడి చేశాడు. అంతేకాదు తన కుమారుడికి చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అనంతరం ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే, మాన్సి తన మామ దురాగతాలను సహించలేకపోయింది. తన భర్తకు చెబితే ఫలితం ఉండదని భావించి, తన కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 18,2020 06:53PM