బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెస్టెంబర్ 21 నుంచి పాఠశాలలు, ప్రీ- యూనివర్సిటీ కాలేజీలు ప్రారంభించనున్నట్లు కర్ణాటక విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. అధ్యయనాలకు సంబంధించి విద్యార్థులు సందేహాలను తెలుసుకోవచ్చన్నారు. రెగ్యులర్ క్లాసులను తిరిగి ప్రారంభించాలనే ప్రశ్నలకు సమాధానమిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ రెగ్యులర్ క్లాసులు ఉండవని కర్ణాటక ప్రాథమిక, మాధ్యమిక విద్య మంత్రి సురేష్ కుమార్ అన్నారు. సాధారణ తరగతులను తిరిగి ప్రారంభించడానికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నామని మంత్రి చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm