విశాఖ: అచ్యుతాపురం కొండకర్ల వద్ద జీవీఈహెచ్ అనే ప్రైవేట్ రిసార్ట్ స్విమ్మింగ్ పూల్లో పడి ఓ యువకుడు మృతి చెందాడు. గాజువాకకు చెందిన సుధాకర్ అనే యువకుని బర్త్ డే పార్టీలో పదిమంది యువకులు పాల్గొన్నారు. పార్టీ అనంతరం స్విమ్మింగ్ చేస్తుండగా సాయి అనే యువకుడు మృతి చెందాడు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. మద్యం సేవించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm