రాజౌరి : జమ్ము కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను సంయుక్త భద్రతా దళాలు శనివారం అరెస్టు చేశాయని కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే -56 రైఫిల్స్, రెండు పిస్టల్స్, నాలుగు గ్రెనేడ్లు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. రాజౌరీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో ఈ ఉదయం భద్రతా దళాలు గాలింపు చేపట్టారు. ఆయుధాలతో కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm