శ్రీనగర్: కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ అభివృద్ధికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేడు రూ. 1350 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. మీడియా సమావేశం ద్వారా ఆయన మాట్లాడుతూ... వ్యాపార వర్గాలు సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటన తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఆత్మ నిర్బర భారత్, ఇతర ప్యాకేజీలతో పాటు వ్యాపార వర్గాల సౌలభ్యం కోసం అందిస్తున్న ఈ ఆర్థిక ప్యాకేజీ అదనం అని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాపార వర్గాలకు ఆరు నెలలు ఎటువంటి షరతులు లేకుండా ప్రతీ రుణ గ్రహీతకు 5 శాతం వడ్డీ సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ చర్య వ్యాపారులకు భారీ ఉపశమనం కలిగించడంతో పాటు స్థానికంగా ఉపాధి కల్పనకు సహాయపడుతుందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm