హైదరాబాద్: కేంద్ర వ్యవసాయ బిల్లును సీఎం కేసీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. రైతులను దెబ్బతీసేలా... కార్పొరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేలా బిల్లు రూపొందించారని విమర్శించారు. ఈ మేరకు బిల్లును వ్యతిరేకించాలంటూ టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ ఆదేశించారు. వ్యవసాయ బిల్లు అమలులోకి వస్తే రైతుల పరిస్థితి దారుణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. రవాణా ఖర్చులు భరించి రైతులు వేరే చోట అమ్ముకోవడం సాధ్యమా? కేంద్ర వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తి లాంటిది అని ధ్వజమెత్తారు. మక్కల దిగుమతి సుంకాన్ని ఎవరికోసం తగ్గించారు? ఆర్థిక సంక్షోభం సమయంలో ఇలాంటి నిర్ణయమా? సుంకం తగ్గించి మక్కలు దిగుమతి చేసుకుంటే రైతులు ఏమైపోవాలని కేసీఆర్ ప్రశ్నించారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, శిరోమణీ అకాలీదళ్ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ కూడా ఈ వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆమె కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm