శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. అవంతీపొర, క్రూ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నందుకుగాను వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారివద్ద నిషేధిత హిజ్బుల్ ముజాహిద్దీన్, అల్-బదర్ ఉగ్రవాద సంస్థలకు చెందిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం రాజౌరీ జిల్లాలో ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను భద్రతాదళాలు అరెస్టు చేశాయి. రాజౌరీ ప్రాంతంలో ముష్కరులున్నారనే సమాచారంతో భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్టు చేశామని, వారి వద్ద రెండు ఏకే -56 రైఫిళ్లు, రెండు పిస్టళ్లు, నాలుగు గ్రెనేడ్లు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm