హైదరాబాద్: కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్లో కొన్ని నెలలుగా నిలిచిపోయిన సిటీ బస్సులు త్వరలో రోడ్డెక్కనున్నాయి. సిటీ బస్సు సర్వీసులపై గ్రేటర్ ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల మహారాష్ట్ర, చెన్నై, కర్ణాటక రాష్ట్రాల్లో టీఎస్ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేశారు. మొదట 50 శాతం బస్సులు అందుబాటులోకి తెచ్చే యోచనలో టీఎస్ఆర్టీసీ ఉంది. ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే 7 రూట్లలో సిటీ బస్సు సర్వీస్లు ప్రారంభించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ నెలాఖరున సిటీ బస్సులు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm