న్యూఢిల్లీ: కరోనా వల్ల 41 మంది సాయుధ దళాల సిబ్బంది మృతి చెందారని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించింది. సాయుధ దళాలలో కరోనా వైరస్ నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. సాయుధ దళాల సిబ్బందిలో 22,353 మంది కరోనా సోకినట్లు ఆయన చెప్పారు, ఈ రోజు వరకు 41 మంది సిబ్బంది కరోనాతో మరణించినట్లు ప్రకటించారు. ప్రోటోకాల్ ప్రకారం సాయుధ దళాల ఆసుపత్రులలో యాంటీ-వైరల్ ఔషధాలు ఉన్నాయని చెప్పారు. తీవ్ర అనారోగ్య రోగుల చికిత్స కోసం సాయుధ దళంలోని రెండు ఆస్పత్రులు ప్లాస్మా థెరపీని ఉపయోగిస్తున్నాయని మంత్రి చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm