నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని గ్రామంలో భాగీరథి పల్లి గ్రామస్తుల ఇండ్లను కూల్చి వాటి స్థలంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బాధితులతో కలిసి సిపిఎం బిక్నూర్ జోన్ కార్యదర్శి కొత్త నర్సింలు పార్టీ కార్యకర్తలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భాగిర్తి పల్లి గ్రామంలో దాదాపు మూడున్నర సంవత్సరాల క్రితం పేద ప్రజల ఇళ్లను కూల్చివేసి వారి స్థలంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే వారికి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మూడున్నర సంవత్సరాల నుంచి వారి స్థలం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు పోవడంతో చిన్న చిన్న రేకుల షెడ్లు, పూరి గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సే ముఖ్యం కాదని ఓట్ల మందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి ఓట్లు దండుకుని కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. గ్రామంలో పూరి గుడిసెలు రేకులలో నివసిస్తున్న పేద ప్రజలకు ఏమి జరిగినా పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్ దేనని అన్నారు. వారం రోజుల్లోగా నిర్మించిన ఇళ్లను ఇవ్వకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజలను ఇళ్లల్లో కూర్చో పెడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్ కమిటీ సభ్యులు మల్లేశం కార్యకర్తలు గ్రామస్తులు శంకర్ నర్సింలు, స్వామి, మల్లయ్య, రాజు, లక్ష్మి శ్యామల, మంజుల తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 19,2020 07:31PM