-రిజర్వేషన్లు-ఫీజు రీయంబర్స్ మెంట్ తీయడంమంటే సామాజిక న్యాయాన్ని పతనం చేయడమే. - ఇది రాజ్యాంగ విరుద్దం
-కెసిఆర్ తెలంగాణలో బడుగులకు తన వైఖరిని తెలపాలి.
-ఎస్.ఎఫ్.ఐ. రౌండ టేబుల్ మీటింగ్ లో వక్తలు
------------------------------------------
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు పక్రియ వెంటనే వెనక్కి తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న ప్రైవేటు యూనివర్శీటిలలో రాజ్యాంగం 46 అధికరణం కల్పించిన ఎస్సి,ఎస్టీ, బి.సి.మైనార్టీ, విద్యార్ధులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిందని రాజ్యాంగం ను ప్రక్కన పెట్టి ప్రైవేటు యూనివర్శీటీలను తెలంగాణ రాష్ట్రంలో తెవడం అంటఘ తెలంగాణలో సామాజిక న్యాయం ను పాతరేయడమేనని ఎస్.ఎఫ్.ఐ.తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ' ప్రైవేట్ యూనివర్శీటీలు- సామాజిక న్యాయం' అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి అధ్యక్షత జరిగిన సమావేశంలో శ్రీరాం నాయక్(గిరిజన సంఘం) ఎం.డి.అబ్బాస్ (ఆవాజ్), స్కైలాబ్ బాబు(కెవిపిఎస్), బుర్రి.ప్రసాద్(వ్య.కా.సం), టి.నాగరాజు(ఎస్.ఎస్.ఐ.), ఆర్.గంగాధర్(ఎ.ఐ.డి.ఎస్.ఓ) లు మాట్లడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ యూనివర్శీటీలను బాగు చేయడం మాని అందరికి ఉన్నత విద్యను అందిస్తామనే పేరుతో ప్రైవేట్ యూనివర్శీటీలు అంటూ ప్రభుత్వం బుకాయిస్తూ తప్పుడు ప్రచారం చేస్తుందని కాని అందరికి విద్యకోసమే అయితే మరి ఏందుకు ఫీజు రీయంబర్స్ మెంట్, రిజర్వేషన్లు ఏందుకు కల్పించడం లేదో ప్రభుత్వం చెప్పడం దేనికి సంకేతం ఇది ప్రభుత్వం విద్య అందించే భాద్యత నుండి తప్పుకోవడమే అన్నారు. ప్రభుత్వం కల్పించిన రాయితీలు వాడుకుంటూ పీడీత కులాల వారీకి మాత్రం రిజర్వేషన్లు మాత్రం కల్పించడం లేదు. ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలంటేనే లాభాలకోసం పని చేసేవని అగ్రకులాల్లో పేద విద్యార్దులకు కూడా నాణ్యమైన, ఉచిత విద్య అందే అవకాశమే లేదు. ఇప్పుడు తెలంగాణలో వచ్చిన యూనివర్శీటీల యాజమానులు ఇప్పటికే అధికార పార్టీలో కోనసాగుతునే విద్యాసంస్థలు నడుపుతున్నారని వారు మార్కెట్ డిమాండ్ ఉన్న కోర్సులు తీసుకు వచ్చి కేవలం లాభాల కోసం మాత్రమే పనిచేస్తాయన్నారు. తెలంగాణ సమాజంలో అత్యధిక మంది దళిత, గిరిజన, ఆదివాసీ, బి.సి, మైనార్టీ విద్యార్ధులేనన్ని ఈ వర్గాల ప్రజల ఓట్లతో గెలిచిన కేసిఆర్ ఆయా వర్గాల విద్యార్ధులకు చదువులు దూరం చేయడమేన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 7 రాష్ట్ర యూనివర్శీటీలు 11 స్పెషలైజ్డ్ యూనివర్శీటీలు ఉంటే గత 8 సంవత్సరాలుగా 2000 పైగా అధ్యాపక, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటినీ ఇంత వరకు అ పోస్టులు భర్తీ చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ యూనివర్శీటీలకు ప్రతియేటా నిధులు తగ్గిస్తూ వాటి అభివృద్ధిని నివారిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు విధానాలు తీసుకువచ్చి కార్పోరేట్, వీదేశీ యూనివర్శీటిలను తీసుకురావాలని కెసిఆర్ ప్రయత్నం చేస్తున్నారని విద్యార్ధులు, మేధావులు ఈ ప్రభుత్వం పై పోరాట బాహూట వేగరవేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఒత్తిడి తెవాడానికి రాష్ట్ర వ్యాప్త పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ.రాష్ట్ర కమిటీ సభ్యులు పడాల శంకర్, సాయికిరణ్, భవాని రిసెర్చ్ స్కాలర్స్ రమేష్, నరేందర్ తదితరులు పాల్గోన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 19,2020 07:39PM