దుబాయ్: ఐపీఎల్ పోటీల్లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు మార్కస్ స్టొయినిస్ పరుగుల వరద పారించాడు. ఆఖరులో చెలరేగి ఆడి 21 బంతుల్లో 53 పరుగులు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి157 పరుగులు చేసింది. జట్టులోని మిగతా ఆటగాళ్లలో పృథ్వీ షా 5, శిఖర్ ధావన్ 0, హెట్మెయిర్ 7, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 39, రిఫబ్ పంత్ 31, అక్షర్ పటేల 6, అశ్విన్ 4, అన్రిచ్ 3 పరుగులు చేశారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు విజయం సాధించాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేయాల్సి ఉంటుంది.
Mon Jan 19, 2015 06:51 pm