ఢిల్లీ: అమరావతి మహిళా ఐకాస నేతలు, మహిళా రైతులు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిశారు. రాజధాని అమరావతి అంశంతో పాటు, ఆందోళనచేస్తున్న మహిళలపై పోలీసుల దాడుల గురించి ఆయనకు వివరించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఐకాస నేతలు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలను పార్లమెంట్లో లేవనెత్తుతామని చెప్పారు. మూడు రాజధానులు అనేవి వాస్తవంగా సాధ్యం కాదని ఏచూరి అన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా సాధ్యం కాని మూడు రాజధానుల విధానం ఇక్కడ అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిపై నిర్ణయం అయిపోయాక మళ్లీ ఇలాంటి నిర్ణయాలు ఎందుకు అని ప్రశ్నించారు. అమరావతిని రాజధానిగా పరిరక్షించాలని, ప్రజాధనాన్ని వృథా చేయకుండా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆయన అన్నారు. అసలే కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మూడు రాజధానులంటూ మరిన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారని విమర్శించారు. అమరావతి మహిళలపై పోలీసుల దాడులు దారుణమని వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm