హైదరాబాద్ : పక్కింటి అబ్బాయి కదా అని మాట్లాడిన పాపానికి ఆ మహిళపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివాహిత ఫిర్యాదు మేరకు గృహిణిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మాచర్ల గ్రామానికి చెందిన గోరేటి శివప్రసాద్ (35) వనస్థలిపురంలో నివాసం ఉంటున్నాడు. పంజాగుట్టలో పనిచేస్తున్నాడు. నాలుగేళ్లుగా అతడి ఇంటికి సమీపంలో ఉంటున్న కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. ఇటీవల శివప్రసాద్ తరుచూ వారింటికి వెళ్తూ.. ఆ గృహిణితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమెకు తెలియకుండా ఫొటోలు, వీడియోలను తీసి.. సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో ఈ నెల 18న ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm