తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయ సంప్రదాయాలకు గౌరవమివ్వకుండా సీఎం జగన్ తిరుపతిలో పర్యటించడానికి వీల్లేదంటూ తిరుపతిలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. నగరంలోని టీటీడీ పరిపాలన భవనం సమీపంలోని వరదరాజ స్వామి ఆలయం వద్ద ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. డిక్లరేషన్ పై సంతకం, దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సీఎం స్పందించాలంటూనినాదాలు చేశారు. సీఎం తిరుమల పర్యటనను అడ్డుకోవాలని టీడీపీ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో పాలీసులు జిల్లా వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహయాదవ్తోపాటు పలువురు సీనియర్ నాయకులను పోలీసులు ఉదయం నుంచే గృహనిర్బంధం చేశారు. టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
Mon Jan 19, 2015 06:51 pm