ముంబయి: దేశీయ మార్కెట్ల నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. నిన్నటి భారీ నష్టాల నుంచి సూచీలు పుంజుకున్నాయి. బుధవారం ఉదయం 9:48 గంటల సమయంలో సెన్సెక్స్ 237 పాయింట్లు ఎగబాకి 37,971 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 66 పాయింట్లు లాభపడి 11,215 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.43 వద్ద కొనసాగుతోంది. కీలక రంగాల షేర్లు రాణిస్తుండడం సూచీలకు దన్నుగా నిలిచింది. ఆసియా మార్కెట్ల అప్రమత్తత దేశీయ మార్కెట్ల జోరుకు కాస్త అడ్డుకట్టగా మారింది. ఐరోపా దేశాల్లో కరోనా వైరస్ విజృంభణ అక్కడి మదుపర్లను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm